ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 7, 2021, 11:57 AM IST

ETV Bharat / state

కోనసీమ అభివృద్ధికి సహకరించండి: ఉపరాష్ట్రపతికి తెదేపా నేత హరీశ్ విజ్ఞప్తి

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయ కర్త హరీశ్ మాథుర్.. దిల్లీలో కలిశారు. కోనసీమ అభివృద్ధకి సహకరించాలని కోరారు.

tdp leader harish mathur meet vice president venkayya naidu
tdp leader harish mathur meet vice president venkayya naidu

ఉప రాష్ట్రపతి వెంకయ్యను.. లోక్​సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు, తూర్పుగోదావరి జిల్లా తెదేపా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త హరీశ్ మాథుర్ దిల్లీలో కలిశారు. కోనసీమ అభివృద్ధికి సహకరించాలని.. ఆ ప్రాంతంలో విద్యా, వైద్య విధానాలు బలోపేతం చేయాలని కోరారు.

దివంగత బాలయోగితో ఉన్న అనుబంధాన్ని ఆయన కుమారుడు హరీశ్​ మాథుర్​తో.. ఉపరాష్ట్రపతి వెంకయ్య పంచుకున్నారు. వీలు చూసుకుని కోనసీమ ప్రాంతంలో పర్యటించాలని హరీశ్ మాథుర్ చేసిన అభ్యర్థనకు ఉపరాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు.

ABOUT THE AUTHOR

...view details