తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యటించారు. తేదేపా గ్రామ కమిటీ ఎన్నికలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిటీలను ఎంపిక చేశారు. ఒక అనుభవం లేని వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఉదాహరణగా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు మాసాల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. మద్యం కంపెనీల నుంచి వైకాపా ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఆ బ్రాండ్ లకు మాత్రమే అమ్మకాలకు అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. అనపర్తి నియోజకవర్గంలో సారా ఏరులై పారుతోందని ఆరోపించారు. వైకాపా కార్యకర్తలకు సారా వ్యాపారం ఉపాధిలా మారిందన్నారు.
'అనుభవం లేని వ్యక్తికి అధికారం ఇస్తే.. ఫలితం ఇదే' - తేదేపా గ్రామ కమిటీ ఎన్నికలు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో జరిగిన తెదేపా గ్రామ కమిటీ ఎన్నికలకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.
!['అనుభవం లేని వ్యక్తికి అధికారం ఇస్తే.. ఫలితం ఇదే' tdp grama kamitee election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5464770-582-5464770-1577091077792.jpg)
tdp grama kamitee election
TAGGED:
తేదేపా గ్రామ కమిటీ ఎన్నికలు