మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని.. వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు కాకినాడ సబ్ జైలు నుంచి జీజీహెచ్కు తరలించారు.
'నాకు వారితో సంబంధాలు లేవు'
పోలీసులు తనపై కక్ష కట్టారని.. తన బావ హత్య కేసులో అన్యాయంగా తనను ఇరికించారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చనిపోయిన తన బావ సత్తిరాజురెడ్డితో..2005 నుంచే వారికి ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారు. తన బావ వ్యసనాలకు గురై కుటుంబాన్ని పట్టించుకోలేదని.. గుండెపోటుతో మరణిస్తే ఫోరెన్సిక్ నివేదికలో తప్పుడు వివరాలు చేర్చారని ఆరోపించారు. సత్తిరాజురెడ్డి మృతదేహాన్ని తన తండ్రి, భార్య, కుమార్తె ఎవ్వరు అడిగినా ఇవ్వలేదని తెలిపారు.