ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలేశ్వరంలో ఉత్కంఠ పోరు.. రీకౌంటింగ్​ కోరుతూ తెదేపా నేతల ఆందోళన

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఆసక్తిగా మారింది. ఏలేశ్వరం 8వ వార్డులో పది ఓట్ల తేడాతో వైకాపా విజయం సాధించగా.. తెదేపా శ్రేణలు రీకౌంటింగ్ చేపట్టాలని ఆందోళన చేపట్టారు.

By

Published : Mar 14, 2021, 5:54 PM IST

tdp cadres demands for recounting in yeleshwaram at east godavari
ఏళేశ్వరంలో ఉత్కంఠ పోరు.. రీకౌంటింగ్​ కోరుతూ తెదేపా నేతల ఆందోళన

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో మొత్తం 20 వార్డులకు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 16 వార్డుల్లో వైకాపా విజయాన్ని కైవసం చేసుకోగా.. తెదేపా 4 వార్డుల్లో గెలిచింది.

8వ వార్డులో పోరు ఉత్కంఠగా సాగగా.. 10 ఓట్ల తేడాతో వైకాపా విజయం సాధించింది. దీంతో తెదేపా శ్రేణులు రీకౌంటింగ్ చేపట్టాలని ఆందోళనకు దిగారు. రీకౌంటింగ్​ చేపట్టలేమని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.

ABOUT THE AUTHOR

...view details