తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు జయంతిని జరిపారు. గోదావరి గట్టున గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్, పంతం సత్యనారాయణ ఛారిటబుల్ట్రస్ట్, కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఏడాది జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీసీసీ ఛానల్ ఎండీ కొండలరావు తెలిపారు. పేదలకు ఆహార పొట్లాలు అందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు రౌతు సూర్యప్రకాశరావు, ఇతర నాయకులు, ఎస్వీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో ఘనంగా ఎస్వీ రంగారావు జయంతి - రాజమహేంద్రవరంలో ఎస్వీ రంగారావు జయంతి వార్తలు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానికులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
![రాజమహేంద్రవరంలో ఘనంగా ఎస్వీ రంగారావు జయంతి SV Rangarao birthday celebrations in rajamahendravaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7876213-322-7876213-1593773701406.jpg)
రాజమహేంద్రవరంలో ఎస్వీ.రంగారావు 102 జయంతి వేడుకలు