ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజధాని విషయంలో కలగజేసుకోవాలని చెప్పటానికి మీరెవరు?

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజధాని విషయంలో కలగజేసుకోవాలని చెప్పటానికి మీరెవరంటూ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Aug 5, 2020, 11:58 AM IST

Published : Aug 5, 2020, 11:58 AM IST

Updated : Aug 5, 2020, 1:01 PM IST

somu veerraju comments on capital
రాజధాని విషయంపై మాట్లాడుతున్న సోము వీర్రాజు

అన్నవరం సత్యనారయణను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని విషయంలో కలగజేసుకొమ్మని చెప్పటానికి మీరెవరని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. వాళ్లా తమకు అజెండాను నిర్ణయించేది అని నిలదీశారు. భాజపాకు ప్రత్యేక అజెండా ఉందనీ.. అది అభివృద్ధి అనే అజెండా అని తేల్చిచెప్పారు. ఆ అజెండాతోనే ప్రజల్లోకి వెళ్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు తీసుకుందని వివరించారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయలను వెచ్చిందని తెలిపారు.

Last Updated : Aug 5, 2020, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details