ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోకా శ్రీ విష్ణుప్రసాద్​రావుకు నివాళి - east godavari latest news

తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోనలో మోకా శ్రీ విష్ణుప్రసాద్​రావు పార్థివ దేహానికి మంత్రి విశ్వరూప్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు.

ghana nivali
మోకా శ్రీ విష్ణుప్రసాద్ రావు పార్థివ దేహానికి నివాళి

By

Published : Dec 28, 2020, 10:49 PM IST

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోనకు చెందిన రాష్ట్ర మాజీ మంత్రి మోకా శ్రీ విష్ణు ప్రసాద్ రావు మరణం.. పూడ్చలేని లోటని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి విశ్వరూప్ కాట్రేనికోనలో దివంగత మోకా శ్రీ విష్ణు ప్రసాద్ రావు పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దళిత వర్గాలకు, ఇతరులకు ఆయన అందించిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు.

ఇదీ చదవండి: 'వకీల్ సాబ్ వచ్చాడని మీ సీఎం సాబ్​కు చెప్పండి'

ABOUT THE AUTHOR

...view details