ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలిక కిడ్నాప్​ కేసు ఛేదన... ఆరుగురు అరెస్టు

తూర్పుగోదావరి జిల్లా శానపల్లిలంకలో కిడ్నాప్​కు గురైన బాలికను పోలీసులు రక్షించారు. విజయవాడలో చిన్నారిని అదుపులోకి తీసుకుని, అపహరణకు పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

By

Published : Dec 16, 2020, 8:17 PM IST

Updated : Dec 16, 2020, 9:11 PM IST

six members arrested in girl kidnap case in east godavari district
బాలిక కిడ్నాప్​ కేసు ఛేదన

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం శానపల్లిలంకలో ఈనెల 14న కిడ్నాపైన బాలిక కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారి(సంయుక్త) అపహరణకు పాల్పడిన బాలిక తల్లి వెంకటలక్ష్మితో సహా ఆరుగురిని అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు. వెంకటలక్ష్మి, రవితేజ మధ్య మనస్పర్థలు ఉండడంతో సంయుక్త తండ్రి వద్ద ఉంటోంది. ఎలాగైనా సంయుక్తను తన వెంట తీసుకువెళ్లాలనే ప్రయత్నంలో... వెంకటలక్ష్మి ఈ దురాగతానికి పాల్పడింది.

Last Updated : Dec 16, 2020, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details