ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయినవిల్లి సిద్ధి వినాయకుడి పాదాల చెంత లక్ష కలముల పూజ

తూర్పుగోదావరి అయినవిల్లిలో కొలువుదీరిన శ్రీసిద్ధి వినాయకుడి పాదాల చెంత లక్ష కలములను ఉంచి వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి దంపతులు పాల్గొన్నారు.

By

Published : Feb 16, 2021, 10:15 PM IST

siddhi-vinayaka-is-worshiped-at-ainavilli-in-east-godavari-with-lakhs-of-pens-on-his-feet
అయినవిల్లి సిద్ధి వినాయకుడు పాదాల చెంత లక్ష కలములతో పూజ

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లిలోని శ్రీ సిద్ధివినాయకుడి పాదాల వద్ద లక్ష కలములతో వేద పండితులు పూజలు నిర్వహించారు. విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు కలగాలని ఆకాంక్షిస్తూ.. దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ పూజలో ఆలయ కార్యనిర్వాహణాధికారి పీపీవీవీ సత్య నారాయణ దంపతులు పాల్గొన్నారు. ఈ నెల 17న కలములను విద్యార్థులకు పంపిణీ చేస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details