ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కట్లు కట్టాలన్న.. కుట్లు వేయాలన్నా సెక్యూరిటీ గార్డే! - రంపచోడవరంలో సెక్యూరిటీ గార్డు వైద్యుడు

ఆ ఆసుపత్రిలో రోగులకు కట్లు కట్టాలన్న... కుట్లు వేయాలన్నా సెక్యూరిటీ గార్డు ఒక్కడే. అక్కడ వైద్యాధికారులు కనబడరు..అతనే ఆ సమయంలో వైద్యుడు. చీకటైతే సెక్యూరిటీ గార్డు. ఒంటిచెత్తోని అన్ని పనులు చేస్తాడు...రోగులకు సేవలు చేస్తాడు. ఎందుకంటే..ఆసుపత్రికి వైద్యులే లేరు. పాపం ఎక్కడికి వెళ్లాలో తెలియని రోగులు..అతనితోనే బతుకుజీవుడా అంటూ చికిత్స చేయించుకుంటున్నారు.

security guard  is treating to patients at rampachodavaram
రంపచోడవరంలో సెక్యూరిటీ గార్డే వైద్యుడు

By

Published : Jun 18, 2020, 6:22 PM IST

సేవ చేయాలని ...ఓ సెక్యూరిటీ గార్డు రోగులకు చికిత్స చేస్తూ..డాక్టర్లు లోని లేటు తీరుస్తున్నాడు. వైద్యులేని ఆ ఆసుపత్రిలో రోగులకు అతనే దేవుడిలాగా కనబడుతున్నారు. చేసేది ఏమిలేక.. ప్రాణాపాయమని తెలిసిన సెక్యూరిటీ గార్డుతోనే చికిత్సలు చేయించుకుంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో ఎమ్​ఎన్​ఓ పోస్ట్ ఖాళీగా ఉండడంతో... ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు సెక్యూరిటీ గార్డే వైద్య సేవలను అందిస్తున్నాడు. గతంలో ఎమ్​ఎన్​ఓ ఉన్నప్పటికీ రాజమహేంద్రవరం జనరల్ ఆసుపత్రికి బదిలీ అయ్యారు. దీంతో గత కొంతకాలంగా ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు కుట్లు వేయాలన్నా, కట్లు కట్టాలన్నా సెక్యూరిటీ గార్డ్​తోనే చేయిస్తున్నారు.

వంద పడకలున్న ఈ ఆసుపత్రిలో ఇద్దరు ఎమ్​ఎన్​ఓలు ఉండాల్సినప్పటికీ ఒక్కరు కూడా లేరు. రాజమహేంద్రవరం జనరల్ ఆసుపత్రి నుంచి ఒకరిని డిప్యూటేషన్​పై నియమించారు. కానీ అతను వారంలో సగం రోజులు రాజమహేంద్రవరంలోనూ, సగం రోజులు రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలోనూ విధులు నిర్వహిస్తుంటాడు. దీంతో రోగులకు కనీస స్థాయిలో కూడా వైద్యసేవలు అందడం లేదు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని రోగులు కోరుతున్నారు.

ఇదీ చూడండి.'వైకాపా ప్రభుత్వం పాలనలో విఫలమైంది..'

ABOUT THE AUTHOR

...view details