తూర్పుగోదావరి జిల్లా ఏలేరు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 23 మందిని ఏలేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ట్రాక్టర్లు, 11 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఏలేరు కాలువలో ఉన్న ఇసుకను గుట్టలుగా వేసి ఇతర ప్రాంతాలకు అక్రమంగా అమ్ముకుంటున్న వైనాన్ని రైతులు అడ్డుకున్నారు. అయితే తమను స్థానిక నాయకులు బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు.
ఇసుక అక్రమ రవాణా.. పోలీసుల అదుపులో 23 మంది - తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా
తూర్పుగోదావరి జిల్లా ఏలేరు కాలువ నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ఘటనలో పోలీసులు 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2 ట్రాక్టర్లు, 11 బైక్లు స్వాదీనం చేసుకున్నారు.
ఇసుక అక్రమ రవాణా