ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోనసీమలో 365 రైతు భరోసా కేంద్రాలు

By

Published : May 29, 2020, 4:34 PM IST

Updated : May 29, 2020, 5:28 PM IST

ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు లాంటి వాటిని రైతులకు చేరువ చేసేందుకు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేస్తోంది. కోనసీమలో 365 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభానికి సిద్ధం అయ్యాయి.

rythu bharosa centers
rythu bharosa centers

వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు నాణ్యమైన సేవలు అందించాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ సేవల కోసం రైతు భరోసా కేంద్రాలు.. కేంద్ర బిందువుగా పనిచేస్తాయి. కోనసీమలో మొత్తం 365 రైతు భరోసా కేంద్రాలను సిద్ధం చేశారు. వీటికి సొంత భవనం లేకపోవడంతో అందుబాటులో ఉన్న సహకార సంఘాల భవనాలతో పాటు.. ఉపయోగించకుండా ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనాలు, ఆసుపత్రి భవనాలు, సామాజిక భవనాలను సిద్ధం చేశారు.

Last Updated : May 29, 2020, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details