ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 21, 2020, 2:41 PM IST

ETV Bharat / state

గన్నవరంలో కారు, లారీ ఢీ.. విరిగిన విద్యుత్ స్తంభం

తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం లో ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.ఈ క్రమంలో.. లారీ రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని బలంగా తాకగా అది విరిగిపోయింది.

Accident
Accident

తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం పరిధిలో.. ఇసుక లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఆపాయం కలగలేదు. రాజమండ్రి నుంచి మల్కిపురానికి ఇసుక లోడుతో వెళ్తున్న లారీ.. తాటిపాక నుంచి రావులపాలెం వెళుతున్న కారును ఢీ కొట్టింది.

కారు, లారీల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. అదుపు తప్పిన లారీ.. రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా అది విరిగిపోయింది. ఈ కారణంగా ట్రాన్స్​కో 15 వేల రూపాయల నష్టం జరిగిందని అధికారి జీవి ఆచార్య తెలిపారు. ప్రమాదం కారణంగా రెండు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ABOUT THE AUTHOR

...view details