ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారును ఢీకొన్న లారీ.. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు - గోపాలపురంలో రోడ్డు ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. కారును.. రాంగ్ రూటాలో వచ్చిన లారీ బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

road accident
road accident

By

Published : Jun 26, 2020, 12:25 PM IST

తూర్పు గోదావరి జిల్లా గోపాలపట్నం చెక్ పోస్ట్ వద్ద లారీ.. కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి వస్తున్న కారు చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసరికి.. రాంగ్ రూట్​లో ఎదురుగా బొండు మట్టితో వస్తున్న లారీ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. ఇళ్ల స్థలాలు మెరక చేసేందుకు గోపాలపురం సమీపంలోని ఉన్న బొండు మట్టిని లారీలో తరలిస్తున్నారు. లారీ రాంగ్ రూట్ లో వచ్చి ఢీ కొట్టడమే ఈ ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details