ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 9, 2020, 6:42 AM IST

Updated : Mar 9, 2020, 9:56 AM IST

ETV Bharat / state

అనపర్తిలో బైక్, లారీ ఢీ...ఒకరు మృతి

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్రమైన గాయాలైన ఘటన తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగింది.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అనపర్తిలో బైక్​ ఢీకొన్న లారీ... ఒకరి మృతి,మరోకరికి తీవ్ర గాయాలు
అనపర్తిలో బైక్​ ఢీకొన్న లారీ... ఒకరి మృతి,మరోకరికి తీవ్ర గాయాలు

అనపర్తిలో బైక్​ ఢీకొన్న లారీ... ఒకరి మృతి

తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్​ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరి మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. అనపర్తి గ్రామానికి చెందిన పిల్లి వీరబాబు, సత్తి సూర్య భాస్కర్ రెడ్డిలు బైక్​పై వెళ్తుండగా వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. ఘటనలో వీరబాబు మృతి చెందగా... భాస్కర్ రెడ్డి గాయాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Mar 9, 2020, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details