ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కందరాడలో ప్రశాంతంగా రీపోలింగ్ - తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం

పిఠాపురం మండలం కందరాడలో.. రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారీ బందోబస్తు నడుమ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

Repolling ended peacefully in Kandarada and The counting process is underway amid heavy security.
కందరాడలో ప్రశాంతంగా రీపోలింగ్

By

Published : Feb 13, 2021, 7:34 PM IST

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో.. రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 9న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో.. లెక్కింపు సమయంలో కొందరు వ్యక్తులు గదిలోకి ప్రవేశించి బ్యాలెట్ పత్రాలను అపహరించుకుపోయారు. దీంతో ఇద్దరు సర్పంచ్​ అభ్యర్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతో.. నేడు ఆ పంచాయతీకి రీపోలింగ్ నిర్వహించారు. భారీ బందోబస్తు నడుమ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details