ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యానాంలోని ఏపీ రైతులకు.. రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్ పథకాల వర్తింపు

By

Published : Apr 29, 2021, 7:34 AM IST

వైఎస్ఆర్ రైతు భరోసా-ప్రధానమంత్రి కిసాన్ పథకాలను యానాంలోని ఏపీ రైతులకూ వర్తింప చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. . ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య ఉత్తర్వులు ఇచ్చారు.

raithu bharosa for yanam farmers
యానాంలో రైతు భరోసా

రాష్ట్రంలో అమలు అవుతున్న వైఎస్ఆర్ రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్ పథకాలను యానాంలోని ఏపీ రైతులకూ వర్తింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య ఉత్తర్వులు ఇచ్చారు. 2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి ఏపీలో భూములు ఉండి యానాంలో నివసిస్తున్న రైతులకూ ఈ పథకాన్ని వర్తింప చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్యవసాయ శాఖ కమిషనర్ చేసిన సిఫార్సుల మేరకు ప్రత్యేక కేసుగా గుర్తించి.. ఈ పథకాన్ని యానాంలోని ఏపీ రైతులకు వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details