రోడ్డుపై దొరికిన పర్సును బాధితుడికి అప్పగించి మానవత్యం చాటుకున్నారు కొత్తపేటకు చెందిన నలుగురు వ్యక్తులు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లిలో రోడ్డు పక్కన పడివున్న పర్సును చెందిన బూసి భాస్కరరావు, గంగుమళ్ళ రాజు, బయ్యే రాంబాబు, పితాని చిన్నాలు చూశారు. అందులో రూ. 30 వేల నగదు, ఏటీఎం కార్డులు, డ్రైవింగ్ లెసెన్స్ను గుర్తించారు. వాటి ఆధారంగా ఊబలంక గ్రామానికి చెందిన నాగబాబు పర్సుగా తెలుసుకున్నారు. ఆ చిరునామా ఆధారంగా అతని ఇంటికి వెళ్లి అందించారు.
పర్సును అప్పగించిన 'ఆ నలుగురు' వ్యక్తులు - రావులపాలెం మండలం తాజా వార్తలు
కొత్తపేటకు చెందిన నలుగురు వ్యక్తులు రోడ్డుపై పడివున్న పర్సును గమనించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా వ్యక్తి చిరునామాను గుర్తించారు. అంతేకాకుండా ఆ పర్సును అతని ఇంటి వద్దకు వెళ్లి అందించారు.

నాగబాబుకు పర్సు అందజేస్తున్న నలుగురు వ్యక్తులు