మార్కెట్లోకి గోదావరి పులస ఎప్పుడొస్తుందా అని పులసప్రియులు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ సీజన్లో మత్స్యకారులకు ఇవి చాలా తక్కువగా దొరుకుతున్నాయి. దీంతో వీటి ధరలు బాగా మండిపోతున్నాయి. శుక్రవారం పి.గన్నవరంలోని చేపల మార్కెట్లో అసలు సిసలైన గోదావరి పులస కిలోన్నర బరువు గలది రూ.ఏడు వేలుకు అమ్ముడుపోయింది. కిలో బరువుంటే రూ. 4,500 కంటే తక్కువ ధరకు దొరకడం గగనమవుతోంది.
చిక్కింది కిలోన్నర పులస చేప - పి.గన్నవరంలో పులస చేప తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని చేపల మార్కెట్లో కిలోన్నర బరువు గల పులస చేప దొరికింది. దాన్ని ఎంతకు అమ్మారనుకుంటున్నారు..! మీరే చూసేయండి..!

పి.గన్నవరంలో పులస చేప