ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 23, 2021, 9:02 PM IST

ETV Bharat / state

జైలు నుంచి దివిస్ వ్యతిరేక ఆందోళనకారుల విడుదల

దివిస్ పరిశ్రమ ఏర్పాటు వ్యతిరేక ఆందోళనల్లో అరెస్టైన 23 మంది.. తూర్పుగోదావరి జిల్లా తుని సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. మొత్తం 36 మంది ఈ కేసులో అరెస్ట్ కాగా.. మిగిలిన వారు కాకినాడ, రాజమహేంద్రవరం జైలు నుంచి బెయిల్​ మీద బయటకు వచ్చారు. వీరందరికీ వామపక్ష, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

left parties grand welcome in tuni, kakinada, rajamahendravaram to protestors against divis pharma
దివిస్ వ్యతిరేక ఆందోళనకారులకు వామపక్షాల ఘన స్వాగతం

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలలో దివిస్ ఫార్మా పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. గతంలో అరెస్టైన పలువురు ఈరోజు జైలు నుంచి విడుదల అయ్యారు. న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయగా.. తుని సబ్ జైలులోని 23 మంది బయటకు వచ్చారు.

జైలు వద్ద వారికి వామపక్ష, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు దగ్గరుండి వారిని స్వగ్రామాలకు తీసుకుని వెళ్లారు. ఈ కేసులో 36 మంది అరెస్టు కాగా.. మిగిలిన వారు కాకినాడ, రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details