ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువుల తవ్వకాలు నిలిపివేయాలని నిరసన - east-godavari-district latest news

తూర్పుగోదావరి జిల్లా గొంది గ్రామంలో స్థానికులు ఆందోళన చేశారు. మంచినీటి చెరువుల సమీపంలో రొయ్యల చెరువుల తవ్వకాలు జరపవద్దని డిమాండ్ చేశారు.

చెరువుల తవ్వకాలు నిలిపివేయాలని నిరసన
చెరువుల తవ్వకాలు నిలిపివేయాలని నిరసన

By

Published : Jun 13, 2021, 5:16 PM IST

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని గొందిలో రొయ్యల చెరువుల తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. గ్రామస్థులు ఆందోళన చేశారు. మంచినీటి చెరువు సమీపంలో 13 ఎకరాలలో గుంతలు తవ్వుతుండటంతో తాగునీరు కలుషితమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై గతంలో ఫిర్యాదు చేయగా.. అప్పుడు తవ్వకాలు ఆపేశారని, ప్రస్తుతం మళ్లీ అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని నిరసనకారులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ABOUT THE AUTHOR

...view details