ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంకలో ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు-ఈ టీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన
ప్లాస్టిక్ కారణంగా మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక పీహెచ్సీ వైద్య అధికారిని శ్రీవల్లి అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు-ఈ టీవీ భారత్ ఆధ్వర్యంలో నాగుల్లంక జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. "ప్లాస్టిక్ను తరిమి కొడదాం" అంటూ ప్రతిజ్ఞ చేశారు.