తీర్ధయాత్రల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన కృష్ణా, గుంటూరు జిల్లా వాసులను ఒడిశా - ఏపీ సరిహద్దుల్లో చింతూరు పోలీసులు నిలిపివేశారు. గత నెల 14న వీరంతా తీర్ధయాత్రల కోసం వెళ్లి.. లాక్డౌన్ వల్ల ఈనెల 21న బిహార్లో చిక్కుకుపోయారు. వీరు స్వగ్రామాలకు వెళ్లేందుకు అక్కడి అధికారులు అనుమతి ఇవ్వడం వల్ల ఏపీ - ఒడిశా సరిహద్దుకు చేరుకున్నారు. అయితే వీరిని అక్కడే అడ్డుకున్న పోలీసులు.. చింతూరు ఆశ్రమ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. వీరందరికి 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వెంకటరమణ తెలిపారు.
తీర్థయాత్రలకు వెళ్లిన రాష్ట్రవాసులు క్వారంటైన్కు..! - గుంటూరు యాత్రికులు క్వారంటైన్కు తరలింపు
తీర్థ యాత్రల కోసం వెళ్లిన రాష్ట్ర వాసులను ఒడిశా - ఏపీ సరిహద్దుల్లో చింతూరు పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణా, గుంటూరు వాసులు ఈనెల 14న తీర్థయాత్రలకని వెళ్లి బిహార్లో చిక్కుకుపోయారు. అక్కడి కలెక్టర్ వీరు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం వల్ల వీరు ఇక్కడికి వచ్చారు. అయితే వీరిని 14 రోజులు పాటు క్వారంటైన్లో ఉంచిన అనంతరం అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.

తీర్థయాత్రలకు వెళ్లిన గుంటూరు, కృష్ణా వాసులు క్వారంటైన్కు తరలింపు
తీర్థయాత్రలకు వెళ్లిన గుంటూరు, కృష్ణా వాసులు క్వారంటైన్కు తరలింపు
ఇదీ చదవండి: