ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుకు గురై రెండు పశువుల మృతి

తూర్పుగోదావరి జిల్లా ఒమ్మంగిలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులు,ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పిడుగుపాటుకు గురై రెండు పశువులు మృతిచెందాయి.

By

Published : Jun 4, 2019, 6:59 AM IST

గేదెలు

పిడుగు పడి పశువులు మృతి

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో వర్షం కురిసింది. గ్రామానికి చెందిన రైతు ఉమ్మిడి అర్జునుడు గేదెలు చెట్టుకింద ఉండగా పిడుగు పడటంతో గేదె, గేదె దూడ మృతి చెందాయి. వీటి విలువ 80 వేల రూపాయలు వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. తన జీవనాధారమైన పశువులు చనిపోవటం చూసి రైతు కన్నీటి పర్యంతమయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details