ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగుతోందని.. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. ఉడుముడిలో నిర్వహించిన జగనన్న పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డప్పు కొట్టి పాదయాత్రను మొదలుపెట్టారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
'ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన' - ఉడుముడిలో జగనన్న పాదయాత్రలో పాల్గొన్న పి. గన్నవరం ఎమ్మెల్యే
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాదయాత్రను నిర్వహించారు. ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా.. సీఎం జగన్ పాలన సాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
!['ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన' mla kondeti chitti babu in jagananna padayatra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9466732-334-9466732-1604747096875.jpg)
పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే చిట్టిబాబు