ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దైవ దర్శనానికి బయలుదేరి... అనంతలోకాలకు! - తూర్పు గోదావరి జిల్లా ప్రమాదాలు

దైవ దర్శనానికి వెళుతూ ఓ వ్యక్తి అనంత లోకాలకు తరలిపోయాడు. మిత్రుడితో కలిసి కొంత దూరం సాఫీగా జరిగిన ద్విచక్ర వాహన ప్రయాణం విషాదంగా ముగిసింది. వాడపల్లి వంతెన రూపంలో గండేపల్లికి చెందిన వీరబాబును మృత్యువు కబళించగా.. నాగరాజు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.

Road accident
రోడ్డు ప్రమాదం

By

Published : Sep 26, 2020, 8:05 PM IST

తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి కొత్త వంతెన వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గండేపల్లికి చెందిన సానబోయిన వీరబాబు.. మిత్రుడు నాగరాజుతో కలిసి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరాడు.

మార్గ మధ్యలో ద్విచక్రవాహనం అదుపు తప్పి వంతెన అప్రోచ్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో వీరబాబు అక్కడికక్కడే మృతి చెందగా.. నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆత్రేయపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details