ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద నీటితో ఇబ్బందులు పడుతున్న లంక గ్రామాల ప్రజలు - kankayalanka latest news

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరదల దాటికి లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాకలిపాలెం సమీపంలోని కనకాయలంక వద్ద కాజ్వే పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది.

people suffering from godavari rever water flow at kankayalanka east godavari district
వరద నీటితో ఇబ్బందులు పడుతున్న లంక గ్రామాల ప్రజలు

By

Published : Aug 15, 2020, 11:48 AM IST

గోదావరి వరదలు లంక గ్రామాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం చాకలిపాలెం సమీపంలో గల కనకాయలంక వద్ద కాజ్వే పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. దీంతో ప్రజలు నాటుపడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం మర పడవలను తక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయటంతో నాటు పడవల ద్వారా గోదావరి నది పాయలు దాటి ఆవతలి వైపునకు వెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పందించి మరిన్ని మర పడవలను ఏర్పాటు చేయాలని కనకాయలంక ప్రజలు కోరుతున్నారు.



ఇదీ చదవండి: గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం.. జలదిగ్బంధంలో దేవీపట్నం

ABOUT THE AUTHOR

...view details