ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డెక్కిన ఆటోలు.. కొరడా ఝుళిపించిన పోలీసులు - Penalties for autos at amalapuram news update

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో రోడ్లపైకి వచ్చిన ఆటోలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకే అపరాధ రుసుములు వసూలు చేస్తున్నామని చెప్పారు. ఇద్దరితోనే తాము సవారీ చేస్తున్నా.. జరిమానాలు ఎందుకని ఆటోవాలాలు ప్రశ్నిస్తున్నారు.

Penalties for autos come on the roads at amalapuram
రోడ్లపైకి వచ్చిన ఆటోలకు ఫెనాల్టీలు

By

Published : May 4, 2020, 1:41 PM IST

లాక్​డౌన్ సడలింపు తెలియగానే తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఆటోలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. పరిస్థితి గమనించిన పోలీసులు ఆటోలకు అపరాధ రుసుములు విధించారు. నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు చేస్తున్న వారికే జరిమానాలు వేస్తున్నామని చెప్పారు.

అయితే లాక్​డౌన్​ సడలింపుల్లో భాగంగా ఇద్దరు ప్రయాణికులకు అనుమతి ఉందని ఆటోవాలాలు గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ అపరాధ రుసుములు విధించడం సరైనది కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details