తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. చిట్టిలంక వారి పేటలో సిమెంట్ రహదారి పనులకు పూజ చేశారు. మారుమూల ప్రాంతాల్లో రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
'మారుమూల ప్రాంతాల్లోనూ రహదారి సౌకర్యాలు అభివృద్ధి చేస్తాం'
నియోజకవర్గంలోని రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలిపారు. చిట్టిలంక వారి పేటలో సీసీ రహదారి నిర్మాణానికి సోమవారం పూజ చేసి ప్రారంభించారు.
చిట్టిలంకలో సీసీ రోడ్డు నిర్మాణానికి పూజ చేసిన ఎమ్మెల్యే