ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్తమ ఫలితాలు దక్కాలని ఆకాంక్షిస్తూ.. లక్ష కలముల పంపిణీ

విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కాలని ఆకాంక్షిస్తూ... లక్ష కలముల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లిలో కొలువుదీరిన శ్రీసిద్ధి వినాయక స్వామి ఆలయ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి విద్యార్థులకు కలములు పంపిణీ చేశారు.

By

Published : Feb 17, 2021, 6:40 PM IST

siddi vinayaka temple ainavalli
లక్ష కలముల పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లిలో కొలువుదీరిన శ్రీసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద లక్ష కలముల పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు మొదలుపెట్టారు. విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కాలని ఆకాంక్షిస్తూ.. ఈ కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ స్వామివారి పాదాల చెంతన లక్ష కలముల ఉంచి పూజ చేశారు. బుధవారం ఉదయం నుంచి విద్యార్థులకు పంపిణీ మొదలుపెట్టారు.

ABOUT THE AUTHOR

...view details