ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇక్కడి సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండరు..! - తూగో జిల్లా ముమ్మిడివరంలోవార్డు సచివాలయం వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలోని పలు వార్డు సచివాలయాల్లో సిబ్బంది లేరు. పనుల కోసం వచ్చిన ప్రజలు వెనుదిరిగారు.

no officers in ward secreteriate in east godavari
అధికారులు లేక వెలవెలబోయిన వార్డు సచివాలయంv

By

Published : Jan 4, 2020, 5:21 PM IST

ఇక్కడి సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండరు..!

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలోని 20 వార్డులకు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలేదు. పాత భవనాలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. కానీ వాటికి తాళాలే దర్శనమిస్తున్నాయి. మొత్తం 20 ఉండగా... 10 వార్డులకు పక్కా భవనాలు లేవు. తాత్కాలిక భవనాలను వినియోగిస్తున్నారు. వార్డు వాలంటర్ల ద్వారా ఇంటికే చేరాల్సిన సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వృద్ధులు పింఛన్ల కొరకు వెళ్తే... సాంకేతిక కారణాలతో చెబుతున్నారు. ఒక్కో కార్యాలయంలో 10 మంది సిబ్బంది ఉండాలి... కానీ ఇద్దరు, ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. ఫలితంగా పనికోసం వచ్చినవారు... వెనుదిరుగుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details