ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 31, 2020, 4:19 AM IST

Updated : Jul 31, 2020, 6:15 AM IST

ETV Bharat / state

కోనసీమలో కరోనా ఉగ్రరూపం..

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది. మార్చి 31 నుంచి జూలై 30 వరకు ఈ ప్రాంతంలో 1,663 పాజిటివ్ కేసులు నమోదయినట్లు అమలాపురం డివిజన్ అడిషనల్ డీఎం ఆండ్​ హెచ్​వో డాక్టర్​ పుష్కరరావు తెలిపారు. వీటిలో 1,110 యాక్టివ్ కేసులుగా ఉన్నాయి.

ninety six new corona positive cases registered in thursday at konaseema east godavari district
కోనసీమలో సంజీవని బస్సుల ద్వారా కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్న వైద్యులు

గురువారం ఒక్క రోజే కోనసీమ వ్యాప్తంగా 96 కేసులు బయటపడ్డాయి. ముమ్మిడివరం మండలంలో 19, ఆత్రేయపురం మండలంలో 22, రావులపాలెం మండలంలో 28, అమలాపురం మండలంలో 12, కొత్తపేట మండలంలో 10, మామిడికుదురు మండలంలో 2, రాజోలు మండలంలో 3 కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో బయటపడుతున్న కేసులతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్ సోకకకుండా ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించాలని వైద్యులు, పోలీసులు సూచిస్తున్నారు.

Last Updated : Jul 31, 2020, 6:15 AM IST

ABOUT THE AUTHOR

...view details