ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాడపల్లి జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా... బడి ఖాళీ - Covid 19 cases in East Godavari district

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. పైగా నవంబర్ 2 నుంచి పాఠశాలలు పునః ప్రారంభంకావటంతో వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. ఆత్రేయపురం మండలం వాడపల్లి జడ్పీ పాఠశాలలోని ఓ ఉపాధ్యాయురాలికి కరోనా సోకటంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాడపల్లి జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా... ఆందోళనలో విద్యార్థులు
వాడపల్లి జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా... ఆందోళనలో విద్యార్థులు

By

Published : Nov 6, 2020, 10:48 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఓ ఉపాధ్యాయురాలుకు కరోనా సోకడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయురాలుకు కరోనా లక్షణాలు ఉండడంతో నవంబర్ 1వ తేదీన కరోనా పరీక్ష చేయించుకున్నారు. రెండో తేదీన ఆమె పాఠశాలకు వచ్చి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అదే రోజు మధ్యాహ్నం ఆమెకు కరోనా సోకినట్లు తెలియడంతో ఉపాధ్యాయురాలుని ఇంటికి పంపించేశారు. ఆ పాఠశాలలో మొత్తం 172 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండగా తొలిరోజు 25 మంది మాత్రమే హాజరయ్యారు. విషయం బయటకు తెలిశాక విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గురువారం ఒక్కరూ పాఠశాలకు రాలేదు. 13 మంది ఉపాధ్యాయులకు కేవలం ఆరుగురు ఉపాధ్యాయులే హాజరయ్యారు. విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో వారు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details