ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో ఓటర్ల జోరు..

తూర్పుగోదావరి జిల్లాలో ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైనులో నిల్చున్నారు. ప్రశాంతంగా ఓటేసేందుకు..అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

By

Published : Mar 10, 2021, 11:21 AM IST

Updated : Mar 10, 2021, 2:05 PM IST

municipal polling at east godavari district
తూర్పుగోదావరి జిల్లాలో ఓటర్ల జోరు..

అమలాపురంలో 6 వార్డులు ఏకగ్రీవం

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని సద్వినియోగం చేసుకుంటున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను 6 వార్డులు ఏకగ్రీవమయ్యాయి 24 వార్డులకు సంబంధించి మొత్తం 32, 040 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు .
అమలాపురంలో మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి, అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్ష్ కౌశిక్ పరిశీలించారు. చేకూరి కీర్తి ఓటర్లతో కాసేపు మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆమె అన్నారు.

తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ఓటు

నిమ్మకాయల చినరాజప్ప సతీసమేతంగా అమలాపురం మున్సిపాలిటీలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఐదవ వార్డులోని ఒకటో పోలింగ్ కేంద్రంలో రాజప్ప సతీమణి అనురాధ సోదరుడు జగ్గయ్య నాయుడు ఓటేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తుందని... ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైకాపా అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.

ఉదయం 9 గంటలకు 17 శాతం పోలింగ్ .

అమలాపురం 15 వ వార్డులో మాజీ శాసనసభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం 9 గంటలకు పట్టణంలో 17 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. శాంతియుతంగా ప్రజలు ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళలు ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు

9 గంటల సమయానికి 5 శాతం పోలింగ్

ముమ్మిడివరం నగర పంచాయతీ 19 వార్డులకు జరుగుతున్న పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కోవిడ్ నిబంధనను అనుసరించి ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీన్.. శానిటైజర్ చేస్తూ పోలింగ్ బూత్​లోకి అనుమతిస్తున్నారు. 9 గంటల సమయానికి 5 శాతం ఓటింగ్ నమోదయ్యింది.

30 వార్డులకు.. 15 వార్డులు ఏకగ్రీవం

తూర్పుగోదావరి జిల్లా తునిలో పురపాలిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తునిలో 30 వార్డులకు 15 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 15 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 27 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

28 వార్డులకు గానూ 10 ఏకగ్రీవం

తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 28 వార్డులకు 10 వార్డులు ఏకగ్రీవం కాగా ....మిగిలిన 18 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. మొత్తం 31 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతోంది. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పటిష్ఠమైన బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.

ఏలేశ్వరంలో ప్రశాంతంగా పోలింగ్

ఏలేశ్వరం మున్సిపాలిటీలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో నిలబడి ఉన్నారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.

కమాండ్ కంట్రోల్ నుంచి పరిశీలన

కాకినాడ కలెక్టరేట్​లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఎన్నికల నోడల్ అధికారి సీహెచ్ నరసింహారావు, వీడియో దృశ్యాల ద్వారా పోలింగ్​ను పరిశీలిస్తున్నారు. మెప్మా పీడీ కె.శ్రీరమణి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.


ఇదీ చూడండి.విజయవాడలో ఓటేసిన పవన్ కల్యాణ్

Last Updated : Mar 10, 2021, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details