ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీ భరత్ ను నిలదీసిన ఎస్సీ సంఘాలు - rajamahendravaram siromundanam news

పోలీసుల దాష్టీకానికి గురైన సీతానగరం శిరోముండనం బాధితుడిని ఎంపీ మార్గాని భరత్ పరామర్శించారు. ఘటనకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ సంఘాల ప్రతినిధులు ఎంపీని డిమాండ్ చేశారు.

mp marghani bharat
శిరోముండనం బాధ్యులపై చర్యలు తీసుకోండి:ఎంపీ భరత్ ను డిమాండ్ చేసిన ఎస్సీ సంఘాలు

By

Published : Jul 22, 2020, 11:09 PM IST

శిరోముండనం బాధ్యులపై చర్యలు తీసుకోండి:ఎంపీ భరత్ ను డిమాండ్ చేసిన ఎస్సీ సంఘాలు

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధిత యువకుడు ప్రసాద్ ను ఎంపీ మార్గాని భరత్ ఆసుపత్రిలో పరామర్శించారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకుంటుదని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపడతాం అని అన్నారు. శిరోముండనం చేయించిన వ్యక్తులపై చర్యలు తీసు కునేందుకు హామీ ఇవ్వాలని ఎస్సీ సంఘాల ప్రతినిధులు ఎంపీని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఇవీ చూడండి-ఎస్సీలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి: తెదేపా నేతలు

ABOUT THE AUTHOR

...view details