భారీ వర్షాల కారణంగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలోని పలు హుండీల్లో నీరు చేరింది. తడిచిన నోట్లను దేవాదాయ శాఖ అధికారులు ఆరబెట్టి లెక్కించారు. 33 రోజులకు సంబంధించి ప్రధాన హుండీల ద్వారా రూ. 19,01,465 లక్షలు, అన్నప్రసాద హూండీల ద్వారా రూ.2,11,438 ఆదాయం రాగా.. మెుత్తం ఆదాయం 21,12,903 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో హుండీని లెక్కించారు. రూ. 21,12,903 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు