"ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి" - mlc elections are transperent
తూర్పు గోదావరి జిల్లాలో శాసన మండలి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లను వివిధ పార్టీల నాయకులకు వివరించారు.
కార్తికేయ మిశ్రా
తూర్పు గోదావరి జిల్లాలో పట్టభద్రుల స్థానాలకు జరగబోయే శాసన మండలి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని రిటర్నింగ్ అధికారి కార్తికేయ మిశ్ర తెలిపారు. కాకినాడలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఆయన ఎన్నికల ఏర్పాట్లనురాజకీయ పార్టీల నాయకులకు వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగినట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఫిబ్రవరి10 నుంచి 23 వరకూ వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఓటర్ల జాబితాలో చేరుస్తామని చెప్పారు.
Last Updated : Feb 26, 2019, 11:52 PM IST