ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం పూర్తయితే..నీటి వృథా మాటే రాదు! - ధవలేశ్వరం ఆనకట్ట

పోలవరం పూర్తయితే 11వందల టీఎంసీల నీరు వృథా అయ్యిండేది కాదంటున్స్తారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

mla gorantla buchaiah choudarai visit to the davaleswaram reservior at east godavari district

By

Published : Aug 10, 2019, 1:21 PM IST

Updated : Aug 10, 2019, 1:30 PM IST

పోలవరం పూర్తైతే.. రైతులకు మేలు జరిగేది...

తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృతిని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. నగరంలోని మురుగునీరు నదిలోకి వెళ్లే నల్లా ఛానల్​ను ఆయన సందర్శించారు. నగరంలోని మురుగు నీటి సమస్యను పరిష్కరించేందుకు ధవళేశ్వరం సాయిబాబా ఆలయం వద్ద పంప్​ హౌస్​లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. లంక గ్రామాల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ఈ సీజన్ లోఇప్పటివరకు ఆనకట్ట నుంచి 11 వందల టీఎంసీల నీరు వృథాగా పోయిందని, పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఆ నీరంతా వృథా కాకుండా, రైతులకు ఉపయోగ పడేదని గోరంట్ల చెప్పారు. ప్రభుత్వం ప్రాజెక్టులు త్వరితగతిన ప్రాజెక్టును పూర్తిచేసి వరద నీటిని నిల్వ చేయాలని ఆయన సూచించారు.

Last Updated : Aug 10, 2019, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details