ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లబ్ధిదారులకు సీఎం సహాయనిధి అందజేత

By

Published : May 24, 2021, 10:08 AM IST

Updated : May 24, 2021, 10:49 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో లబ్ధీదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మీ అందజేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న 19 మందికి చెక్కులను పంపిణీ చేశారు.

MLA Dhanalakshmi
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా ఎల్లవరం గ్రామంలో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మీ, డీసీసీబీ మాజీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్.. నియోజక వర్గానికి చెందిన 19 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.

గతంలో ప్రైవేటు ఆసుపత్తుల్లో చికిత్స చేయించుకుని, వైద్యం నిమిత్తం అయిన ఖర్చుల వివరాలను వీరి దృష్టి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరు చేశారు. లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

Last Updated : May 24, 2021, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details