ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 8, 2020, 9:41 PM IST

ETV Bharat / state

సంకల్పయాత్రను స్మరిస్తూ ఎమ్మెల్యే చిర్ల పాదయాత్ర

ప్రజా సంకల్పయాత్ర మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాదయాత్ర చేపట్టారు.

సంకల్పయాత్రను స్మరిస్తూ పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే చిర్ల
సంకల్పయాత్రను స్మరిస్తూ పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే చిర్ల

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి, లొల్ల గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాదయాత్ర నిర్వహించారు.

పథకాలపై అవగాహన..

యాత్రలో భాగంగా ప్రజల సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. అర్హులైన వారికి పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకుని పథకాల గురించి వివరించారు.

అదే జగన్ సర్కార్ లక్ష్యం..

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికి చేర్చడమే లక్ష్యంగా గ్రామ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా గ్రామ వాలంటీర్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి : సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేను: ఏజీ కె.కె.వేణుగోపాల్

ABOUT THE AUTHOR

...view details