తూర్పుగోదావరి జిల్లాలో తప్పుల తడకగా బియ్యం కార్డు
తప్పుల తడకగా నూతన బియ్యం కార్డు - ap govt
ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన బియ్యం కార్డులో తూర్పుగోదావరి జిల్లా నాగుల్లంకకు చెందిన ఓ కుటుంబ వివరాలు తప్పుగా నమోదయ్యాయి. తల్లీ, ఇద్దరు కుమారుల పుట్టిన తేదీలు ఒకే విధంగా ప్రచురితమయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన కుటుంబ యజమాని.. ఈ కార్డులోని వివరాలు తమను విస్మయానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తప్పుల తడకగా ఉన్న ఈ కార్డును సరిచేయాలని ఆయన కోరుతున్నారు.
![తప్పుల తడకగా నూతన బియ్యం కార్డు Mistaken rice card in East Godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6313388-942-6313388-1583472060771.jpg)
తూర్పుగోదావరి జిల్లాలో తప్పుల తడకగా బియ్యం కార్డు