ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు - సీఎం జగన్ పర్యటన తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో ఈనెల 25న ముఖ్యమంత్రి జగన్ పర్యటించి ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు ధర్మాన కృష్ణదాసు, కురసాల కన్నబాబు, వేణుగోపాలకృష్ణ పరిశీలించారు.

సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు
సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు

By

Published : Dec 22, 2020, 9:24 PM IST

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఈనెల 25న ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు ధర్మాన కృష్ణదాసు, కురసాల కన్నబాబు, వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. ఏర్పాట్లపై కలెక్టర్​ను అడిగి వివరాలు తెలుసుకుున్నారు.

అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా ముప్పై లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనన్నట్లు మంత్రి కృష్ణదాస్ వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్ మురళీధర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details