ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్యాచార బాధితురాలిని పరామర్శించిన మంత్రి తానేటి వనిత

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని మంత్రి తానేటి వనిత పరామర్శించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని ఆదేశించారు.

By

Published : Nov 29, 2020, 11:51 AM IST

taneti vanitha
తానేటి వనిత, మంత్రి

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల బాలికను ఓ గుర్తు తెలియని కామాంధుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన విషయం తెలిసిందే.

కాకినాడ జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని ఆదేశించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. బాధితురాలి పేరిట రూ.10 లక్షలు డిపాజిట్ చేయనున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details