ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉనికి కోసమే రోజుకో అంశం తెరమీదకు' - cbn latest news

ప్రతిపక్ష నేతపై దాడి గురించి మంత్రి తానేటి వనితి స్పందించారు. వైకాపా శ్రేణులు ఎవ్వరూ వారిపై దాడులు జరపలేదన్నారు. సానుభూతి కోసమే తెదేపా శ్రేణులు ఇలా చేయించి ఉండొచ్చని పేర్కొన్నారు.

'ఉనికి కోసమే రోజుకో అంశం తెరమీదకు'
'ఉనికి కోసమే రోజుకో అంశం తెరమీదకు'

By

Published : Nov 29, 2019, 5:49 PM IST

మంత్రి తానేటి వనితి

ప్రతిపక్ష నేత చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్న వాహనంపై... వైకాపా శ్రేణులు ఎవ్వరూ దాడులు చేయలేదని మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. సానుభూతి కోసం తెలుగుదేశం శ్రేణులతోనే ఇలా చేయించుకొని ఉండొచ్చని రాజమహేంద్రవరంలో వ్యాఖ్యానించారు. వారి రాజకీయ లబ్ధికోసమే ఇలా చేస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో చక్కని పాలన అందిస్తున్నామన్నారు. తెలుగుదేశం ఉనికి కోసమే రోజుకో అంశాన్ని తెరమీదికి తెస్తున్నారని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details