కరోనాపై ప్రజలు భయపడాల్సిన పనిలేదని.. ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగంతో చేపట్టే చర్యలపై సమీక్షించామని చెప్పారు. కేసులు వచ్చిన ప్రాంతాల్లో మ్యాపింగ్ చేసి ఇతరులకు అంటకుండా ఉండేందుకు ప్రజలు బయటకు రాకుండా చూస్తున్నామన్నారు. రాబోయే 13 రోజులు కూడా లాక్డౌన్ను విజయవంతంగా పూర్తి చేస్తే కరోనా వైరస్ను తరిమికొట్టవచ్చున్నారు.
'కరోనాను ఎదుర్కోడానికి సర్వం సిద్ధంగా ఉన్నాం'
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమై ఉందని రాష్ర మంత్రి పినిపె విశ్వరూప్ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో పర్యటించారు.
కరోనా వైరస్ నియంత్రణకు తీసుకున్న చర్యలు చెపుతున్న మంత్రి