తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద చికిత్స పొందుతున్న పడవ ప్రమాద క్షతగాత్రులను మంత్రి ఆళ్లనాని పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 8 మృదేహాలు ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నాయనీ, మరో నాలుగు మృతదేహాలు వెలికితీసినట్లు వెల్లడించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి సంబంధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు వివరించారు.
పడవ ప్రమాద క్షతగాత్రులకు మంత్రి ఆళ్లనాని పరామర్శ - east godavari
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో క్షతగాత్రులైనవారిని మంత్రి ఆళ్లనాని పరామర్శించారు.
![పడవ ప్రమాద క్షతగాత్రులకు మంత్రి ఆళ్లనాని పరామర్శ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4454052-135-4454052-1568614999778.jpg)
పడవ ప్రమాద క్షతగాత్రులకు మంత్రి ఆళ్లనాని పరామర్శ
పడవ ప్రమాద క్షతగాత్రులకు మంత్రి ఆళ్లనాని పరామర్శ
ఇదీ చదవండి : "గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయ చర్యలు ముమ్మరం"