ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోనసీమలో రూ.145 కోట్ల పనులకు అనుమతులు

By

Published : May 31, 2020, 11:44 AM IST

ఈ ఆర్థిక సంవత్సరంలో కోనసీమలోని 16 మండలాల్లో 145 కోట్ల రూపాయలతో ఉపాధి పనులు చేపట్టేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు.

mgnregs works started in Konaseema
కోనసీమలో రూ.145 కోట్ల పనులకు అనుమతులు

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని 16 మండలాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నూట నలభై ఐదు కోట్ల రూపాయల నిధులతో 28వేల 200 పనులు చేసేందుకు అనుమతులు వచ్చాయి. ప్రస్తుతం ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 70 శాతం పనులు వచ్చే నెల 20 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

చెరువులు, కాలువల్లో పూడిక తీత పనులు, నీటి కుంటలు ఏర్పాటు, రోడ్ల నిర్మాణం వంటి పనులకు ప్రాధాన్యం కల్పించారు. ఈ పనులు ద్వారా కోనసీమలోని సుమారు ఎనిమిది వేల మందికి ఉపాధి కలుగుతుంది. కరోనా దృష్ట్యా ఉపాధి కూలీలు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:కోనసీమలో 365 రైతు భరోసా కేంద్రాలు

ABOUT THE AUTHOR

...view details