తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం గైగోలుపాడులో.. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. మంత్రి కన్నబాబు ఆదేశాలతో 16 మందికి గర్భిణీలకు సీమంతం చేశారు. నాగమణి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
వైకాపా ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక సీమంతం - కాకినాడలో వైకాపా ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు
తూర్పుగోదావరి జిల్లా గైగోలుపాడులో గర్భిణీలకు వైకాపా ఆధ్వర్యంలో సామూహిక సీమంతం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేశామని నిర్వాహకులు తెలిపారు.

వైకాపా ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక సీమంతం