ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మడ అడవులు నరికి చెరువులు తవ్వేస్తున్నారు - east godavri district latest news

తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామమైన గోగుల్లంకలో కొంతమంది మత్స్యకారులు మడ అడవులను నరికేసి... చెరువులు తవ్వేస్తున్నారు.

mangroves forest destroyed by fishermen in east godavari district
చెరువులుగా మారుతున్న మడ అడవులు

By

Published : Feb 21, 2020, 2:51 PM IST

చెరువులుగా మారుతున్న మడ అడవులు

తూర్పు గోదావరి జిల్లా ఐ. పోలవరం మండలంలో రెండు వేల కుటుంబాలు నివసించే లంక గ్రామం గోగుల్లంక. వీరి ప్రధాన జీవనాధారం మెట్ట వ్యవసాయం, కొబ్బరితోటలు. సముద్రానికి చేరువలోనే ఉన్న ఈ గ్రామానికి రక్షణ కవచం మడ అడవులే. గతంలో ప్రకృతి విపత్తుతో వచ్చిన అనేక వరదలు, తుపానులు, ఉప్పెనల నుంచి వీటి కారణంగానే.. ఈ లంక గ్రామం సురక్షితంగా ఉంది. ఇప్పుడు స్థానికంగా ఉండే కొంతమంది మత్స్యకారులు మడ అడవులను తొలగించి చెరువులు తవ్వుతున్నారు. ఫలితంగా.. భవిష్యత్తులో లంక గ్రామం కనుమరుగయ్యే పరిస్థితి ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలే ఈ పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details