ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం..యువకుడి తల నరికి చెరువులో పడేసిన దుండగులు - బొమ్మూరు పోలీస్ స్టేషన్​ తాజా వార్తలు

ఓ యువకుడి తల నరికి.. మృతదేహాన్ని చెరువులో పడేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నంలో జరిగింది. చెరువులో పడేసిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. రాజమహేంద్రవరంలోని శాంతినగర్​కు చెందిన దుర్గాప్రసాద్​గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

man murdered brutally at bhupalapatnam body recovered
యువకుడి మృతదేహం

By

Published : Dec 29, 2020, 7:26 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాజానగరం మండలం భూపాలపట్నం వద్ద చెరువులో ఓ యుకుడిని తల నరికి గోనె సంచిలో కట్టి పడేసారు. చెరువులో పడేసిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు రాజమహేంద్రవరంలోని శాంతినగర్​కు చెందిన దుర్గాప్రసాద్​గా గుర్తించారు.

ఈ నెల 15న తన కుమారుడు అదృశ్యమైనట్టు దుర్గాప్రసాద్​ తండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఎవరు హతమార్చారనే విషయంపై రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పోస్టుల వివాదం.. తెదేపా నేత దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details